కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం

-

రాష్ట్రపతి ముర్ము సమక్షంలో తొలుత ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. అనంతరం కొంతమంది ఎంపీలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.శ్రీకాకుళం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయనను ప్రధాని మోడీ కేబినెట్లో తీసుకున్నారు. దేశ ప్రజల అభ్యున్నతికి పాటు పడతానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

దివంగత టీడీపీ నేత, తండ్రి కింజరపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి శ్రీకాకుళం ఎంపీగా వరుసగా మూడుసార్లు గెలిచి యువ నాయుకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు

.

Read more RELATED
Recommended to you

Latest news