కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించిన ఉపరాష్ట్రపతి…

-

తెలంగాణ టూరిజం శాఖ ఆద్వర్యంలో నేటి నుంచి 15 వరకు సంక్రాంతి పండగ సందర్భంగా.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన దేశ సంస్కృతిని చాటే విధంగా పండుగలను మరచిపోకుండా జరుపుకోవాలని కోరారు. సంప్రదాయ పండుగలు కొన్ని కుటుంబాలకు ఉపాదిని కల్పిస్తుందని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమం ప్రారంభంతో పరేడ్ గ్రౌండ్స్‌లో చిన్నారులు రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తుండగా పలువురు స్వీటు ప్రియులు రుచులను ఆస్వాదిస్తున్నారు. 2016 నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ ఈ ఏడాది సైతం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో నగరంలో జరిగిన వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ డిజైన్లు, ఆకృతులలో గాలి పటాలు తయారు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news