ఈ మ్యాచ్ లో ఓటమికి కారణం అతనే: న్యూజిలాండ్ కెప్టెన్ లాతమ్

-

ధర్మశాలలో ముగిసిన మ్యాచ్ లో ఇండియా కివీస్ పై అయిదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ద్వారా నాలుగు మ్యాచ్ ల అనంతరం ఓటమి చెందిన జట్టుగా వరల్డ్ కప్ లో నిలిచింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ స్పందిస్తూ… ముఖ్యంగా మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి పది ఓవర్లలో మెరుగైన క్రికెట్ ను ఆడడంలో విఫలం అయ్యాము అంటూ అంగీకరించారు. ఆ తర్వాత మ్యాచ్ ఓటమిపై స్పందిస్తూ ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ బంతి బంతికి పరుగు జత చేస్తూ మ్యాచ్ ను మా వైపు నుండి లాగేసుకున్నాడు అంటూ లాతమ్ చెప్పడం విశేషం.

మేము ఎన్ని ప్లాన్ లు వేసినా వాటిని చేధించుకుంటూ కోహ్లీ ఇండియాను విజయం వైపు నడిపించడంలో సక్సెస్ అయ్యాడంటూ అతనిపై లాతమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ప్రత్యర్థి నుండి ఛేజ్ మాస్టర్ కోహ్లీ కి ఇంతకు మించి ఏమి కావాలి అంటూ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version