శ్రీలంక పర్యటనలో టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్..?

-

కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక పర్యటనకు దూరంగా ఉండడంతో భారత్ కు కెప్టెన్ ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇండియా హెడ్ కోచ్ గా బీసీసీఐ గౌతమ్ గంభీర్ ను జూలై 9 అధికారికంగా ప్రకటించింది.భారత జట్టు సెలక్షన్ కమిటీతో గంభీర్ తొలి సమావేశం ఈ వారం చివర్లో జరగనుంది. రెండు ఫార్మాట్లకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను ఎంచుకోవాలని గంభీర్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.

వన్డే ఫార్మాట్ కు గతంలో భారత్ ను నడిపించిన కేఎల్ రాహుల్ శ్రీలంక టూర్ కు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ కు కెప్టెన్ గా పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. రాహుల్ కెప్టెన్సీలో భారత్ 2023 చివర్లో సౌత్ ఆఫ్రికా పై 2-1 తో సిరీస్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య ఉన్నప్పటికీ కూడా రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన హార్దిక పాండ్య ఇప్పటివరకు వన్డే మ్యాచ్ ఆడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news