కొల్లూరు ORRపై ప్రమాదం.. ముగ్గురు కార్మికులు దుర్మరణం

-

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ నుంచి వేగంగా దూసుకు వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకు వెళ్లింది. ఆ తర్వాత ఓఆర్ఆర్ పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న కార్మికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.

అటుగా వెళ్తున్న వాహనదారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు బాబు రాఠోడ్(48), కమలీ బాయ్ (43), బసప్ప రాఠోడ్ (23)లుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా లారీ డ్రైవర్‌ను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కేసు నమోదు చేసి ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news