కర్ణాటక ఫలితాన్ని 2022 లోనే ఊహించా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలపై మరియు కర్ణాటక ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కర్ణాటక లో వచ్చిన ఎన్నికల ఫలితాలు.. గత ఏడాది నేను ఊహించిందే అన్నారు. బీజేపీ పాలనకు అక్కడ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరగడమే వారి పతనానికి కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా కర్ణాటక లో వచ్చిన ఫలితమే తెలంగాణలోనూ వస్తుందని నమ్మకంగా మాట్లాడారు. ఇక అందరూ అనుకుంటున్నట్లు ఇక్కడ సీనియర్ నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని కొట్టి పారేశారు.

ఇక్కడ అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామన్నారు. తెలంగాణాలో ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ విజయబావుటా ఎగురవేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version