మోడీకి మళ్లీ అవకాశం ఇస్తే ఏపీ, తెలంగాణని కలిపేస్తారు :కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీకి మరొకసారి అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ కలిపేస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ గ్రామంలో 120 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మోడీ దేశానికి ప్రధానమంత్రా లేక ఉత్తర భారతదేశానికి ప్రధానమంత్రా అని ఫైర్ అయ్యారు.

దేశంలో ఎన్నికలు జరుగుతున్న పలు రాష్ట్రాల్లో అధికారంలో వచ్చిన బిజెపి మత రాజకీయాలకు తెర తీసిందని… ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు తో బాన్సువాడ నియోజకవర్గం తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తోంది అని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version