జాహ్నవి కుటుంబానికి న్యాయం జరగాలి.. KTR డిమాండ్..!

-

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులని వాహనంతో గుద్ది చంపిన అమెరికన్ పోలీసులు సరైన ఆధారాలు లేవని అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల కేటీఆర్ ఆవేదన చెందారు. గురువారం ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ అంశంలో అమెరికా రాయబారి కార్యాలయం వెంటనే జోక్యం చేసుకుని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకున్నారు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు జాహ్నవి ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news