పాన్‌ ఇండియాలో కేసీఆర్‌ పార్టీ సంచలనం సృష్టిస్తుంది – కేటీఆర్

-

పాన్‌ ఇండియాలో కేసీఆర్‌ పార్టీ సంచలనం సృష్టిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ లో నిన్న గంగుల కమలాకర్ రావు నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు పార్టీ దేశంలో దుమ్ము రేపే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

కేసీఆర్ తీసుకునే రేపటి నిర్ణయం దేశంలో దుమ్ము రేపుతుందని పేర్కొన్నారు. గతంలో తెలుగు సినిమాలలో తెలంగాణ గురించి చెప్పుకోలేక పోయేవారు..స్వరాష్ట్రం వచ్చాక తెలంగాణ నేపథ్యం ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయన్నారు. తెలుగు సినిమాలు ఈ మధ్య దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతున్నాయని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

దేశ ప్రజలు బలమైన రాజకీయ పక్షం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ అపజయాలతో కోలుకోలేకపోతున్నది. బీజేపీని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నది. టీఆర్‌ఎస్‌ దేశమంతా విస్తరించాలన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version