కృష్ణాష్టమి వేడుకలలో 5 గురు మృతి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

-

కృష్ణాష్టమి వేడుకలలో 5 గురు మృతి చెందారు. రామంతపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం అని కేటీఆర్ స్పందించారు. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనదన్నారు.

KTR Reacts on 5 people died during Krishnashtami celebrations
KTR Reacts on 5 people died during Krishnashtami celebrations

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news