కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమానికి పాల్గొనవద్దు – కేటీఆర్ విజ్ఙప్తి

-

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ ఇన్చార్జిలు ఈ రోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విజ్ఙప్తి చేసారు.
న‌ల్లగొండ జిల్లా ప‌రిధిలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నేడు ఉద‌యం త‌న నామినేష‌న్‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నేడు ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుంచి చండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజ‌రు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు విజ్ఙప్తి చేసారు కేటీఆర్‌. ఈ రోజు మునుగోడు అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేవలం స్థానిక నియోజకవర్గ కార్యకర్తలు మాత్రమే హాజరు కావాలని కోరారు. నియోజకవర్గ ప్రచారం కోసం వచ్చిన ఇన్చార్జీలు వారి వెంట వచ్చిన కార్యకర్తలు తమ తమ కార్య క్షేత్రాలలో యధావిధిగా ప్రచారం కొనసాగించాలి. నామినేషన్ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల ఇన్చార్జీలు హాజరుకావద్దని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version