పోలవరం కాఫర్ డ్యాం కుంగిపోవడంపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ !

-

పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం కుంగిపోవడంపై స్పందించిన కేటీఆర్…. జాతీయ హోదా ఇచ్చి, ఎన్డీఏ ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కాపర్ డ్యాం కుంగిపోయి, కొట్టుకుపోయినా NDSAకి కనిపించడం లేదా ? అని నిలదీశారు. అదే కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే, NDSA మూడు సార్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చారని ఫీ అయ్యారు.

KTR responds to the sagging of the Polavaram project coffer dam
KTR responds to the sagging of the Polavaram project coffer dam

కూలేశ్వరం అని కారుకూతలు కూసే కాంగ్రెస్ – బీజేపీ నేతలకు పోలవరంను.. కూలవరం అనే దమ్ము ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఏకంగా 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యాంను గుట్టుచప్పుడు కాకుండా ఏపీలో యుద్ధప్రాతిపదికన రిపేర్ చేస్తున్నారన్నారు. అదే తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ వద్ద తట్టెడు సిమెంట్ పోయలేదు.. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే అని ఆగ్రహించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news