Have you remembered the leaders of KTR?.. Bandi Sanjay is a strong counter.

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తొచ్చారా?అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది మీరే కదా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్లకు 15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా అని తెలిపారు. మీ పాలన నుంచే నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు .

మీరెందుకు నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించలేకపోయారు అని బండి సంజయ్ ప్రశ్నించారు. పవర్ లూమ్ సంస్థలు మూతపడేలా చేసింది మీరే కదా అని ఆయన ఆరోపించారు. ప్రధాని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రకటించినప్పుడు సిరిసిల్ల గుర్తుకు రాలేదా కేటీఆర్ అని ప్రశ్నించారు. నేతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా అని ,కరీంనగర్ ఎంపీగా నా బాధ్యత కూడా అదే అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version