కల్యాణి జ్యువెల్లర్‌లో కుమారి ఆంటీ…. ఫోటోలు వైరల్ !

-

కుమారి ఆంటీ…. యూటూబ్ ఫుడ్ వ్లాగర్స్ పుణ్యమా అని ఈ పేరు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఈ పేరు వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీది మెుత్తం1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు.గుడివాడ నుంచి హైదరాబాదు నగరానికి వచ్చి ఇక్కడ రోడ్డు సైడ్ ఫుడ్ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుందీ.ఈమె ఇంటర్వ్యూల కోసం పలు యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు ఎగబడుతున్నాయి.

ఇదిలా ఉంటే… తాజాగా కల్యాణి జ్యువెల్లర్‌లో అరుంధతి అనుష్క మాదిరి భారీ బంగారు నక్లెస్ కొనుగోలు చేసింది కుమారి ఆంటీ. ఈ సందర్భంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల డబ్బు పొదుపు చేసుకుని ఈ కొన్నానని వెల్లడించింది. ఒక్కసారే బంగారం కొనడమంటే కష్టమవుతుంది కదా’ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ నగను చూసి…కుమారి ఆంటీ బాహుబలిలాంటి భారీ నక్లెస్‌ను కొన్నది.. ఎన్ని తులాలో.. అంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news