గుంటూరు కారం నుంచి ‘ కుర్చీ మడత పెట్టి’ వీడియో సాంగ్ రిలీజ్

-

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం.  సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్ 80 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

 

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news