ఇద్దరు పిల్లల చేతులు కట్టేసి.. చెరువులో తోసి తల్లి ఆత్మహత్య

-

వికారాబాద్ జిల్లా, కొడంగల్ మండలం, హుస్నాబాద్ లో కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్ప,ఎల్లమ్మ(26) భార్యాభర్తలు. వీరికి రజిత, అనిత, రాజు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిన్న ఉదయం భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారని చెబుతున్నారు.

suicidethinkphotos

ఈ క్రమంలో కలత చెందిన ఎల్లమ్మ తన ముగ్గురు పిల్లలు రాజు, రజిత, అనితతో కలిసి కొడంగల్ మండలంలో హస్నాపూర్ చెరువు వద్దకు చేరుకుని పిల్లలందరికీ చున్నీతో చేతులు కట్టేసి వారిని ముందు తోసేసి తను కూడా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో అనిత అనే అమ్మాయి ఎలాగో తప్పించుకుని బయటపడింది. కానీ ఎల్లమ్మ, రాజు, రజిత ముగ్గురు చెరువులో పడి చనిపోవడం జరిగింది. హృదయ విదారకమైన ఈ ఘటన చుట్టు పక్కల ప్రాంతాల వారిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version