ఎంపీ లక్ష్మణ్: కేసీఆర్ అడుగుజాడల్లో సీఎం రేవంత్ రెడ్డి..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు ఉందని బిజెపి ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. పేదలని గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు ఏబీవీపీ విద్యార్థిని పట్ల పోలీసులు అనుసరించిన తీరు దురదృష్టకరమని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి మెజార్టీ సీట్ల ని గెలిపించాలని కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అయినా పిలుపునిచ్చారు.

 

అవినీతి లేని పాలనని ప్రధాన నరేంద్ర మోడీ అందిస్తున్నారని అన్నారు. మోడీ పాలనలో దళారుల బెడద లేదని చెప్పారు. అలానే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికవాదంగా కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు లక్ష్మణ్. అలానే రామాలయం ప్రారంభంని రాహుల్ గాంధీ తిరస్కరించలేదని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారతదేశం పేరు సాధించిందని ఆయన అన్నారు రాజ్యాంగబద్ధంగా మోడీ పాలన సాగిస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version