శ్రీలంక క్రికెట్ జ‌ట్టులో ల‌సిత్ మ‌లింగాకు చోటు క‌ల్పించిన సెలెక్ట‌ర్లు…!

-

శ్రీ‌లంక ఫాస్ట్ బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగా గ‌త ఏడాది కాలంగా జ‌ట్టుకు దూరంగా ఉంటున్న విష‌యం విదిత‌మే. అయితే మ‌లింగా మ‌ళ్లీ జ‌ట్టుతో క‌ల‌వ‌బోతున్నాడు. ఈ నెల 15వ తేదీన యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానున్న‌ ఆసియా క‌ప్‌లో ఆడ‌నున్న శ్రీ‌లంక జ‌ట్టులో మ‌లింగా చోటు సంపాదించాడు. ఈ క్ర‌మంలోనే ఆసియా క‌ప్‌కు గాను 16 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును తాజాగా లంక సెలెక్ట‌ర్లు ప్ర‌క‌టించారు.

2017‌లో భారత్‌పై చివరిసారిగా మలింగ తన వన్డే మ్యాచ్‌‌ని ఆడాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రీడల మంత్రి పెదవి విరిచారు. ఆటగాళ్లకి కనీస ఫిట్‌నెస్ ప్రమాణాలు కూడా లేవని ఆ సమయంలో మంత్రి విమర్శించడంతో లసిత్ మలింగ క్రీడల మంత్రిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీలంక జట్టులో చోటు కోల్పోయాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.

ఈ క్ర‌మంలో మలింగ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ప్రకటించిన వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో శ్రీలంక జట్టుకి ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ టోర్నీలో భార‌త త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌ను చాలా రోజుల గ్యాప్ త‌రువాత ఢీకొన‌బోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news