ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పర్ఫామెన్స్.. డ్యాన్స్‌ చేసేది ఎవరో తెలుసా?

-

మరో రెండ్రోజుల్లో ఆస్కార్ వేడుకలు జరగబోతున్నాయి. ఎప్పుడూ లేనంతగా తెలుగు ప్రేక్షకులు ఈ వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఉండటం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు దక్కిన ఆదరణ దృష్ట్యా ఆస్కార్‌ నిర్వాహకులు ఈ సాంగ్‌ లైవ్ పర్ఫామెన్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ పాటకు స్టెప్పులేసిన చరణ్, తారక్‌లే లైవ్ పర్ఫామెన్స్ కూడా ఇస్తారని అంతా భావించారు.

కానీ వారికి రిహార్సల్స్‌ చేసే సమయం లేదని, అందుకే అస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయడం లేదని ఆస్కార్ నిర్వాహకులు స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ నటి, డ్యాన్సర్‌ లారెన్‌ గాట్లెబ్‌ నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

‘’స్పెషల్‌ న్యూస్‌.. ఆస్కార్స్‌ వద్ద నాటు నాటు పాటకు నేను లైవ్‌ ప్రదర్శన ఇవ్వబోతున్నాను. ప్రపంచలోనే ఎంతో ప్రతిష్టాత్మక వేదికపై భారత్‌ తరుపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందకు సంతోషంగా ఉంది’’ అంటూ తన ఫొటోను షేర్‌ చేసింది. ఇక ఇదే వేదికపై కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌గా నాటు నాటు పాటను పాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version