ధోనీ తోలి ప్రొడక్షన్ కి హీరోయిన్ ఫిక్స్!

-

మహేంద్ర సింగ్ ధోని ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

రమేష్ తమిళమని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆయన రాసిన అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోని-తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ లు హీరో హీరోయిన్ లుగా నటించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన టీమ్ నుండి రావాల్సి ఉంది. తొలి ప్రాజెక్టును భారతదేశంలోని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చేరనున్నారు. ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version