టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి చాలా మంది ప్రముఖులు మరణించారు. అటు కరోనా మహమ్మారి, ఇటు వరుస విషాదాలు చిత్ర పరిశ్రమను కబలించివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్ర శేఖర్ రెడ్డి మరణించారు.

ఈ రోజు ఉదయం 8.30లకు చెన్నైలో పి. చంద్ర శేఖర్ రెడ్డి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు కాగా… సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు పి. చంద్ర శేఖర్ రెడ్డి. ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌ బాబు లాంటి అలనాటి ప్రముఖ హీరో లు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు… సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు పి. చంద్ర శేఖర్ రెడ్డి ఎక్కువ దర్శకత్వం వహించారు. ఇక పి. చంద్ర శేఖర్ రెడ్డి మృతి పట్ల… సినీ ప్రముఖులు, ఆయన మిత్రులు, బంధువులు సంతాపం తెలిపారు. కాగా ఇటీవలే సిరివెన్నెల మరణించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news