ఎల్ఐసీలో అదిరిపోయే ప్లాన్..రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఆదాయం..

-

ప్రభుత్వం ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎన్నో పథకాలు జనాలకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ జీవితం సాగినంత కాలం జీవన ప్రయాణానికి భరోసా ఉంటుంది. ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలోకి కచ్చితంగా డబ్బులు వచ్చి పడతాయి.

ఇంటి అవసరాలు, పిల్లల చదువుల వ్యయాలు, వ్యక్తిగత ఖర్చులు సహా అన్ని రకాల ఖర్చులను ఈజీగా దాటుకుంటూ వెళ్లవచ్చు. రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. పిల్లల బాధ్యతలు తీరినా కుటుంబ ఖర్చులు మాత్రం తగ్గవు, పైగా పెరుగుతాయి. దీనికి తోడు అనారోగ్యాలు చుట్టుముట్టి మందుల ఖర్చులు కూడా నెలనెలా ఖర్చులు అధికం అవుతున్నాయి. మరి పదవి విరమణ తర్వాత డబ్బులు కావాలి..

అలాంటివారి కోసం ఎల్ ఐసీ అదిరిపోయే ప్లాన్ తీసుకువచ్చింది..ఈ ప్లాన్ పేరు ఎల్ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ. ఈ పథకాన్ని కొనడం వల్ల, మీరు ప్రతి నెలా దాదాపు 36 వేల రూపాయలు అందుకోవచ్చు. దీంతో మీ ఇంటి, వ్యక్తిగత ఖర్చులను సులభంగా భరించవచ్చు. ఎవరి పైనా ఆధారపడకుండా గౌరవంగా బతకవచ్చు. ఈ ప్లాన్ ద్వారా, తన ఖాతాదార్లు ప్రతి నెలా సంపాదించే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తోంది. దీనివల్ల జీవిత భద్రత, ఆర్థిక భద్రత రెండూ సాధ్యమవుతాయి.ఈ పాలసీలో, మీరు ప్రతి నెలా రూ. 36,000 పొందడానికి, యూనిఫాం రేటుతో జీవితాంతం చెల్లింపు యాన్యుటీ ఆప్షన్ తీసుకోవాలి. అంటే  మీ వయస్సు 45 ఏళ్ల సంవత్సరాల ఉండి ఈ ప్లాన్ని తీసుకోవాలి అనుకుంటే.. రూ. 70 లక్షల సమ్ అస్యూర్డ్ ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో 71,26,000 రూపాయల సింగిల్ పేమెంట్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెలా రూ. 36,429 పెన్షన్ వస్తుంది. అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే, పింఛను ఆగిపోతుంది..

35 నుంచి 85 ఏళ్ల వయస్సు వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.ఈ పాలసీలో ఉన్నాయి. ఏడాది పింఛను మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా నెలనెలా పింఛను పొందే ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు 75 ఏళ్లు ఉండి, ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే… మీరు రూ. 6,10,800 ఏకమొత్తం ప్రీమియం చెల్లించాలి. దీనిపై సమ్ అస్యూర్డ్ ఆప్షన్ రూ. 6 లక్షలు. ఇందులో.. ఏడాది పింఛను రూ. 76,650, అర్ధ వార్షిక పింఛను రూ. 37,035, త్రైమాసిక పింఛను రూ. 18,225. నెలవారీ పింఛను 6 వేల రూపాయలు మీకు అందుతుంది. తక్కువగా పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news