క్రికెట్‌ మ్యాచ్‌లో కత్తిపోట్లు…పగిలిన తలలు..!

-

క్రికెట్‌ మ్యాచ్‌లో కత్తిపోట్లు…పగిలిన తలలు..!క్రికెట్ మైదానం కాస్త రణభూమిగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకేరోజు రెండు జిల్లాల్లో క్రికెట్‌ మైదానాల్లో ఘర్షణలు జరగడం కలకలం రేపింది. అటు విశాఖ జిల్లాలో కత్తిపోట్లకు దారి తీయగా, ఇటు ప్రకాశం జిల్లాలో రెండు వర్గాలకు చెందిన యువకులు బ్యాట్లు, స్టంప్స్‌ కర్రలతో దాడికి దిగారు.

విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం మూలపేట శివారులో స్ధానిక గ్రౌండ్ లో క్రికెట ఆడుతున్న యువకుల మధ్య వివాదం తలెత్తింది. మాటమాట పెరగడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఆ తర్వాత ఎవరికి వారు ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఈ వివాదంతో జోడ సాయి అనే కుర్రాడిపై సూర్య అనే మరో యువకుడు కక్ష పెంచుకున్నాడు. మరుసటి రోజు అదే గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతున్న సాయిపై కత్తితో దాడికి దిగాడు సూర్య. ఈ ఘటనలో గాయపడ్డ బాధితుడికి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం  మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. నిందితుడు సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే మరోవైపు ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారి పాలెనికి చెందిన రాజారావు, సురేంద్ర, క్రాంతి అనే ఈ ముగ్గురు యువకులు క్రికెట్ ఆడేందుకు ఊరి చివరన ఉన్న గ్రౌండ్‌ కు వెళ్లారు. అయితే అక్కడున్న మరికొంతమంది యువకులు.. ఆ మైదానంలో క్రికెట్ ఆడే విషయంలో ఘర్షణకు దిగారు. వివాదం ముదరడంతో బ్యాట్లు, వికెట్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తలలు పగిలిపోయాయి. తీవ్రంగా గాయపడిని వీరిని కొండపి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ దాడుల వెనుక గ్రూపు తగాదాలు ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news