ఒకపక్క కరోనా విజృంభణ.. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండయాత్రతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకు కూడా ఉంటుందని అంచనా వేశారు. దీంతో ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా మిడతల ముప్పు తెలంగాణకు తాత్కాలికంగా తప్పినట్టే అని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని రాంటెక్ నుండి మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు పయనించి మెహడే అనే గ్రామంలో ఆగాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే మిడతలు దక్షిణ దిశగా పయనించి ఉంటె తెలంగాణకు చేరేవని..అయినప్పటికీ అవి ఎప్పుడు ఎటు ప్రయాణిస్తాయో తెలియదు కాబట్టి సరిహద్దు జిల్లాల అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణకు తప్పిన మిడతల ముప్పు..!
-
Previous article
Read more RELATEDRecommended to you
రైతులకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్ పై పవన్ కీలక ప్రకటన
రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ ప్రకటించారు. కూటమి...
Anji N -
రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటన
ఈనెల 25న నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది....
చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ...