తెలంగాలోకి ప్రవేశించిన మిడతల గుంపు..!

-

ఒకపక్క కరోనా విజృంభణ.. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండయాత్రతో భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసింది. మహారాష్ట్రలో ఉన్న మిడతలు దక్షిణ దిశలో ప్రయాణిస్తే తెలంగాణకు చేరుకుంటాయని… ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ మిడతల గుంపు తెలంగాణలోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్ మండలం పెద్దంపేట ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. పెద్దంపేట గోదావరి పరీవాహక ప్రాంతంలో చెట్లను నాశనం చేస్తున్నాయి. దీంతో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. దీంతో అక్కడి నుంచి ఇవి ఎటువైపు వెళ్తాయనే టెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news