లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌.. అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ చర్చ

-

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖత్తార్,వినోద్ తావ్డే, తరుణ్ చుగ్,మన్షుక్ మండవీయ,అశ్విని వైష్ణవ్, శివ్ ప్రకాష్, బీఎల్ సంతోష్ సమావేశమయ్యారు.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించనున్నట్టు ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి . ఎగ్జిట్ పోల్ ఫలితాలను తోసిపుచ్చుతూ ఇండియా కూటమి వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని బీజేపీ అగ్రనేతలు సమీక్షించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జూన్ 4న కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింస, అశాంతికి తావులేని విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘంను బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news