థియేటర్ లో లోక్ సభ ఎన్నికల ఫలితాలు… ఎక్కడ అంటే..?

-

రేపు సాయంత్రం 6 గంటలకు దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఆ తర్వాత జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడుతాయి. ఇక ఆ రోజున యావత్ దేశం మొత్తం టీవీలు ,ఫోన్లకు అతుక్కుపోతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే మహారాష్ట్రలోని కొంతమంది థియేటర్ ఓనర్స్ కాస్త భిన్నంగా ఆలోచించారు.మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఈ ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు.

ముంబయి లోని ఎస్‌ఎం5 కల్యాణ్‌, సియాన్‌, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్‌ థియేటర్లు, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్‌ ఎటర్నిటీ, ఠాణెలోని ఎటర్నిటీ మాల్‌, వండర్‌ మాల్‌,పుణెలోని మూవీమ్యాక్స్‌ తదితర థియేటర్లు జూన్‌ 4న ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నారు.ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారట.6 గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నారట. ఇందుకోసం టికెట్‌ ధరలు రూ.99 నుంచి మొదలుకొని రూ.300 వరకు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news