ప్రజల సొమ్ముతో రుషికొండపై విలాసవంతమైన భవనాలు : పురందేశ్వరి

-

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజల సొమ్ముతో విశాఖ రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనాలతో పెత్తందారీ ఎవరో ప్రజలకు అర్థమైందని , వైసీపీ హయాంలో ప్రజాదనం భారీగా దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు.

5 సంవత్సరాల పాలనలో జగన్ కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని, కానీ రూ.500కోట్లతో భారీ భవనాలు నిర్మించుకున్నారని పురందేశ్వరి విమర్శించారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం పోలవరానికి నిధులు ఇస్తుందని అన్నారు. రాజమహేంద్రవరం లోక్ సభ స్థానం నుంచి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి.. బాధ్యత తనకు అప్పగించారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పురందీశ్వరి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news