ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కే ఓటు వేశా- నాగబాబు

-

’మా‘ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి. ఉదయం 8 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు జరిగే పోలింగ్ లో అనేక నాటకీయత చోటు చేసుకుంటుంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం, రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం, మరోవైపు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని ఉమ్మడిగా ప్రకటించడం వంటి సంఘటనలు పోలింగ్ ఎంత హాట్ గా జరుగుతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఉదయం నుంచే పెద్దపెద్ద స్టార్లు నుంచి చిన్న ఆర్టిస్టుల దాకా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాన్, మోహన్ బాబు, బాలక్రిష్ణ వంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాాగా నాగబాబు కూడా తన ఓటును వేశారు. తన ఓటును ప్రకాష్ రాజుకే ప్యానెల్కు ఓటు వేశానని కుండబద్దలు కొట్టారు. డెమోక్రసీకి ఓటు వేశానని నాగబాబు వెల్లడించారు. ఎన్నికల ముందు నుంచే నాగబాబు ప్రకాష్ రాజుకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కూడా నామద్దతు ప్రకాష్ రాజుకే ఉంటుందని నాగబాబు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version