పథకాలతో అదరగొట్టేసిన మాధవన్ కుమారుడు..ఫ్యాన్స్ దిల్ ఖుషీ..!

-

కోలీవుడ్ , టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మాధవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన తనయుడు వేదాంత్ మాధవన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితుడే. ప్రస్తుతం మరొకసారి నెటిజన్ ల ప్రశంసలు అందుకుంటున్నాడు వేదాంత్ మాధవన్. తాజాగా జరిగిన “ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023” లో మాధవన్ కుమారుడు మరోసారి అద్భుతం సృష్టించాడు. స్విమ్మింగ్ లో ఏకంగా 7 పథకాలు అంటే 5 స్వర్ణ పథకాలు, 2 రజిత పథకాలు సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ ఫోటోలను మాధవన్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే గతంలో కూడా వేదాంత్ స్విమ్మింగ్ లో ఎన్నో పథకాలు సాధించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వేదాంత్..”తానేం సాధించినా దాని వెనుక తన తండ్రి మాధవన్ ఉంటాడు అని తెలిపాడు . ఒలంపిక్స్ లో స్వర్ణ పథకం సాధించడమే తన లక్ష్యమని ” తెలిపాడు వేదాంత్.. ఇకపోతే కొడుకుతో దిగిన ఫోటోలను మాధవన్ షేర్ చేస్తూ ..” వేదాంత్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అతడికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు ” అంటూ తెలిపారు.

ఇది చూసిన నెటిజెన్లు అటు మాధవన్, ఇటు ఆయన కుమారుడు వేదాంత్ మాధవన్ లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినీ క్రీడా ప్రముఖులు కూడా పలు రకాలుగా అభినందనలు తెలుపుతున్నారు. మొత్తానికైతే మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.. ఇక మాధవన్ సినీ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల రాకెట్రీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన త్వరలో మరొక అద్భుతమైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news