తెల్లారితే అల వైకుంఠపురములో రిలీజ్ – సెన్సేషనల్ న్యూస్ బయటకొచ్చింది !!

-

 

మహేష్ బాబు నటించిన సరిలెరు నీకెవ్వరు చిత్రం ఒక్క టాక్ కొంచెం తేడాగా వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక్క అల వైకుంఠపురములో బృందం కొద్దిగా ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే అనుకున్న స్థాయిలో థియేటర్లు పొందలేక కొద్దిగా ఢీలా పడిన వారికి మరి కొద్ది గంటల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకి ఈ మిక్స్డ్ రావడం అనేది చాలా అవసరం.

 

దీనిని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేందుకు త్రివిక్రమ్ మరియు అతని ప్రమోషనల్ టీమ్ సన్నాహాలు జరుపుతుండగా చిత్రంలోని ఒక ఆసక్తికరమైన అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే అతి బ్రహ్మాండమైన పాటలను తనలో నింపుకున్న ఈ చిత్రంలో మరొక పాట ని దాచి పెట్టి ఉంచటం. ఆ పాట అలాంటి ఇలాంటి పాట కాదు పక్క ఫోక్ సాంగ్.

వివరాలు ఖచ్చితంగా తెలియదు కానీ… ఉన్న సమాచారం ప్రకారం ‘సితరాల’ అని పిలవబడే ఈ పాటలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వంటి పెద్ద హీరోలను ఈ పాటలో ఇమిటేట్ చేసి రచ్చ లేపబోతున్నాడట. ఇది వరకే రిలీజ్ అయిన పోస్టర్ లో బన్నీ ఒకే గెటప్ లో మూడు సార్లు ఒక్కో స్టెప్పు వేస్తున్నట్టు కనపడేది ఈ పాటలోనే. ఈ ఘనత థియేటర్ లో క్లిక్ అయింది అంటే ఏమో ఎవరికి తెలుసు మహేష్ రికార్డులను స్టైలిష్ స్టార్ కొట్టేస్తాడేమో.

Read more RELATED
Recommended to you

Latest news