మహేష్ బాబు తో పెట్టుకుంటే అంతే మరి..!!

-

మహేష్ బాబు హీరోగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా SSMB28 ఎట్టకేలకు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్పీడ్ గా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్,  తోనే ప్రారంభం అయ్యింది.

ఇక ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు SSMB28 కు నైజం ఏరియా రైట్స్ కోసం దిల్ రాజు మహేష్ బాబు సినీ చరిత్ర లోనే ఎక్కువ మొత్తంగా  రూ.50కోట్లు ఇచ్చి మరీ కర్చీఫ్ వేసినట్లు గా తెలుస్తోంది. దీని వెనక మహేష్ బాబు పంతం తో పాటు, దిల్ రాజు కెరియర్ స్ట్రాటజీ కూడా ఉందని తెలుస్తోంది.

వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు దిల్ రాజు పై చాలా కోపంగా ఉన్నారట. దానికి కారణం గతంలో సర్కారు వారి పాట సినిమా విషయం లో ఫేక్ కలెక్షన్స్ చెప్పొద్దని దిల్ రాజు మీడియా లో చెప్పడం జరిగింది. దీనితో మహేష్ బాబు కు విషయం తెలిసి భవిష్యత్ లో దిల్ రాజు కు సినిమా ఇవ్వొద్దని గాట్టిగా చెప్పారట. దానితో నైజాం ఏరియా లో తనకు దెబ్బ పడుతుందని దిల్ రాజు మళ్లీ మహేష్ ను ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లారట. అక్కడే మహేష్ బాబు చాతుర్యం చూపించి దిల్ రాజు తో ఎక్కువ మొత్తానికి రైట్స్ తీసుకొనేలా చేసారట. ప్రస్తుతం దిల్ రాజుకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్థితి

Read more RELATED
Recommended to you

Latest news