ఏప్రిల్ లోపు విశాఖలో రాజధాని ఏర్పాటు – వై.వి సుబ్బారెడ్డి

-

ఈ ఏడాది ఏప్రిల్ లోపు విశాఖలో రాజధాని ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి. ఈలోపు కోర్టులోని వాదనలను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. విశాఖ గర్జనలోనే రాజధానిని మారుస్తామని చెప్పామని, ఏప్రిల్ లోపు విశాఖకు రాజధాని తరలింపు పూర్తవుతుందన్నారు. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామన్నారు వై వి సుబ్బారెడ్డి. సాగరనగరంలో ఉడాకు చెందిన ఆస్తులతో పాటు అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

భీమిలి రోడ్డు లోని ఐటీ కంపెనీలకు ఉద్దేశించిన భవనాలతో పాటు ఇతర బిల్డింగులలో తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పడవచ్చు అని చెప్పుకొచ్చారు. విశాఖ వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారన్నది సమస్య కాదని, అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా ఉపయోగించుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news