అభిమానులకు మహేష్ రిక్వస్ట్…!

-

దేశంలో ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనాకు ఎంత కష్ట పడి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. దీనితో ఇప్పుడు వేడుకల విషయంలో దాదాపు అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. తాజాగా మహేష్ బాబు తన ఫాన్స్ కి ఒక రిక్వస్ట్ చేసాడు. ప్రియమైన అభిమానులకు… మీరు అందరూ నాకు తోడుగా ఉండటం నా అద్రుష్టం.

నా పుట్టిన రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తు ఉండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరిని నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనం అందరం చేస్తున్న ఈ యుద్దంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా… ప్రేమతో మీ మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version