నిర్భయ దోషులపై మహేష్ సంచలన ట్వీట్…!

-

నిర్భయ దోషులను ఉరి తీయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యావత్ దేశం మొత్తం సోషల్ మీడియాలో ఉరిశిక్ష అమలుపై హర్షం వ్యక్తం చేస్తుంది. సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ… దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఈ మేరకు అతను ఒక ట్వీట్ కూడా చేసాడు.

ఈ ఉరి శిక్ష తో అందరి మరోసారి న్యాయ వ్యవస్థపై నమ్మకం వచ్చిందని మహేష్ అన్నారు. న్యాయం కోసం రేయింబవళ్లు పోరాడిన నిర్భయ తల్లిదండ్రులకు సెల్యూట్ అన్నాడు. మన న్యాయ వ్యవస్థను అంతా గౌరవించాలని, ఇప్పటికీ కొన్ని దారుణాలు జరిగినపుడు వెంటనే అమలయ్యే శిక్షలు ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాలేమో అని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా కూడా న్యాయం గెలిచినందుకు ఆనందంగా ఉందన్నాడు.

ఇక తమిళస్టార్ హీరో కార్తీ కూడా దీనిపై తన అభిప్రాయం చెప్పాడు. 8 సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందన్న కార్తీ… కానీ అలాంటి వాళ్లు ఇంకా చాలా మంది న్యాయం కోసం చూస్తున్నారన్నాడు. పొల్లాచి కేసులో న్యాయం జరగడానికి ఇంకెంత సమయం పడుతుందో అని కార్తి ఈ సందర్భంగా ప్రశ్నించాడు. ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికే సంవత్సరం అయిపోయిందని, ఈ ఘటన నుంచి మనం చాలా నేర్చుకోవలసి ఉందన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version