మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్…!

-

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అందరి దృష్టి మల్కాజ్గిరి సెగ్మెంట్ల మీదే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్స్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ సెగ్మెంట్లో పార్టీ జెండా పాత ఎందుకు బిజెపి బీఆర్ఎస్ పలు వ్యూహాలు రచిస్తున్నాయి. గురువారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలని దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఎవరికి రాబోతోంది అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది ఈరోజు జరిగిన నాయకుల భేటీ కార్యక్రమంలో సీఎంతో పాటు పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు దీంతో సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైందని జోరుగా ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news