16 సీట్లు రావాలని మొక్కుకున్న: మల్లారెడ్డి

-

మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి శనివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలానే ముక్కులను కూడా చెల్లించుకున్నారు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడం జరిగింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కి పాజిటివ్ వాతావరణం ఉందని చెప్పారు మల్లారెడ్డి.

అలానే అయన మాట్లాడుతూ ఇంకోసారి తమ పార్టీ సత్తా ఏంటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు అధికారం లోకి వచ్చిన 50 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ 50 వేషాలు వేసిందని అన్నారు కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని ఆలయాలు అభివృద్ధి చెందాయని చెప్పారు కొండగట్టు అభివృద్ధికి 500 కోట్లు ప్రకటించిందని ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆలయాలు మళ్లీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news