హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధినే చూసే బీఆర్ఎస్ కి పట్టం కట్టారు : కేటీఆర్

-

హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టంకట్టారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు చేసే వెదవ పని గుర్తుకొస్తుంది.ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది కాంగ్రెస్ .పదేళ్లలో కరెంట్ పోలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుంది. డిసెంబర్9న రైతులు లోన్లు తెచ్చుకో అన్నాడు, ఇప్పటి దాకా రుణమాఫీ చేయలేదు అన్నారు.

డిసెంబర్ 9, జనవరి 9 పోయింది ఫిబ్రవరి 9వచ్చింది ఇంకా రుణమాఫీ కాలేదు.  500 రూపాయల బోనస్ రైతులకు ఇస్తామన్నారు ఇవ్వలేదు. 70 ఏళ్ల వ్యక్తి కేసిఆర్ ను నోటికొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం స్థాయి మరిచి కేసిఆర్ ను తిడుతున్నారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తాం. కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారు. పదేళ్లు మోడీ మాకు సహకరించక పోయిన మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము. కానీ రేవంత్ రెడ్డి కి ఇలా ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గటం మంచిది కాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు ఉండాలి. కానీ డుడు బసవన్న లాగే ఉండే ఎంపీ లు అవసరం లేదు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news