మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు, అక్రమాలు సాగవు : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

-

యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మంత్రి మల్లారెడ్డి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు.విద్య, వైద్యం, రాజకీయం పేరుతో మల్లారెడ్డి ఫ్యామిలీ కోట్ల రూపాయలు దండుకంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు.మల్లారెడ్డి ఇకపై నీ ఆటలు అక్రమాలు సాగవని.. మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకుని.. దాచుకున్న ప్రతి పైసా బయటకు వస్తుందని అన్నారు మైనంపల్లి రోహిత్. గత కొద్దిరోజులుగా మెదక్ నియోజక వర్గానికి చెందిన విద్యార్థులు వారి బాధను తనతో చెప్పుకుంటున్నారని తెలిపారు. అవగాహన లేని వారు కళాశాల నడుపుకుంటూ విద్యార్థులను, వారి తల్లి తండ్రులను హింస పెడుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version