కాంగ్రెస్, సీపీఎం లకు ఓటు వెయ్యకండి: మమతా బెనర్జీ

-

బెంగాల్లో కాంగ్రెస్ సిపిఎం పొత్తుల మీద తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విమర్శలు చేశారు. రాష్ట్రం లో ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి అనే ముచ్చట లేదని చెప్పారు కాంగ్రెస్ సిపిఎంలకు ఓటు వేయద్దు అని ప్రజలకి పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

బెంగాల్లో ఇండియా కూటమి లేదు ఆ కూటమికి పేరు పెట్టింది నేను దాని ఏర్పాటు కి కీలక పాత్ర పోషించాను. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కాంగ్రెస్ సిపిఎంలు బిజెపి కోసం పనిచేయటం మొదలుపెట్టాయి అని మమతా బెనర్జీ చెప్పారు. బిజెపిని ఓడించాలని భావించే వాళ్ళందరూ కాంగ్రెస్ సిపిఎంలకు ఓటు వేయద్దు అని ఓటర్లకి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news