కరోనా వస్తుంటే మొహం మీద ఉమ్ము వేసాడు..!

-

దేశ రాజధాని ఢిల్లీలో 25 ఏళ్ల మణిపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రాత్రి ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఈ అవాంచిత సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విజయా నగర్ లోని స్థానిక మార్కెట్లో లోని ఒక దుకాణంలో నిత్యావసర సరుకులు కొనుక్కుని ఇంటికి వెళ్తుండగా, ఇంచుమించుగా 50 యేళ్ల వ్యక్తి అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

ఆమె అతని అసభ్య మాటలను ప్రతిఘటించగా అతను ఆమె పై ఉమ్మి వేసి కరోనా అని అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన తో ఆమె కొద్ది సేపు విస్మయం చెందారు, ఆ పరిస్థితి నుంచి తేరుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలం లో సీసీ టీవీ పుటెజ్ ల ఆధారంగా నిందితుని కోసం వెతుకుతున్నారు.

ఈ సంఘటన తాలూకు ఫోటోలు న్యూస్ పేపర్ లో, సోషల్ మీడియా లో రావడంతో ఈ వార్త చదివిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ వెంటనే నిందితుని పట్టుకోవాలని, covid-19 పై పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో ఇలాంటివి జరగడం సమంజసం కాదు అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version