అమరావతిలో కాల్‌మ‌నీ క‌ల‌క‌లం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

-

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్‌మనీ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పులిచ్చి ఆస్తులు రాయించుకుని బాధితులను రోడ్డున పడేస్తున్న కాల్‌మనీ వ్యవహారంలో తాజాగా అమ‌రావ‌తిలో మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తాడేపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ఆదివారం కలకలం చోటుచేసుకుంది. వెంకటేష్ అనే యువకుడు ఒంటి మీద పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని ప్రయత్నాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అడ్డుకున్నారు.

తాను సాంబశివరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నానని, అందుకు బదులుగా రూ. 23 లక్షలు అతను వసూలు చేశాడని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెంకటేశ్‌ చెప్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు అతను చెప్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వెంకట‌ను పోలీసులు కాపాడి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news