తెలంగాణ కాంగ్రెస్ పై మాణిక్యం ఠాకూర్ ఫోకస్.. !

-

తెలంగాణ‌ కాంగ్రెస్ వ్యవహారాల పై ఏఐసీసీ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ ఫోక‌స్ పెట్టారు. రెండురోజుల పాటు హైదరాబాద్ లోనే మానిక్కం ఠాగూర్ బ‌స చేయ‌నున్నారు. అంతే కాకుండా ఈ రోజు ఆయ‌న‌ వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఉదయం 11గంటలకు ఇందిరా భవన్ లో అసెంబ్లీ సమన్వయ కర్తల తో సమావేశంలో ఆయ‌న పాల్గొన‌బోతున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ల తో భేటి కానున్నారు. సాయంత్రం 7గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో మానిక్కం ఠాగూర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపిక, దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు, భవిష్యత్ కార్యాచరణ పై ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news