రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్లు

-

ఆంధ్ర ప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు దక్కాయి.ఇటీవల కాలంలో ఎన్నికల అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. బోగస్ ఓట్ల వ్యవహారంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాలను ఈసీ బదిలీ చేసింది.

అయితే తాజాగా వీరికి ఎన్నికలతో సంబంధం లేని శాఖలకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురికి సైతం పోస్టింగులు దక్కాయి. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు,ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోగా లక్ష్మీషా, టీటీడీ జేఈవోగా గౌతమిని నియమించారు. వీరితో పాటు పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి,మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా అంబేద్కర్ నియమించారు. సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డికి అనదపు బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news