మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ ల నుండి తెలంగాణకు భారీ సంఖ్యలో మావోయిస్టులు ?

-

మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ ల నుండి తెలంగాణకు భారీ సంఖ్యలో మావోయిస్టులు వచ్చినట్టు చెబుతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్టాల నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రవేశించినట్టు పోలీస్ నిఘా వర్గాల నుండి సమాచారం. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల ఏజన్సీని ప్రత్యేక బలగాలు అణువణువునా జల్లెడపడుతున్నాయి.

18 maoists in chhattisgarh surrendered to police
 

రేపు ఏజన్సీలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. ములుగు జిల్లా వెంకటాపుర్ లో డీజీపీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రేపు 11, 12 గంటల మధ్య తెలంగాణ డీజీపీ ప్రత్యేక హెలికాప్టర్ లో వెంకటాపుర్ కి రానున్నారని అంటున్నారు. ఆయన పర్యటనకి సన్నాహాలు చేసందుకు ఇప్పటికే ఐ. జి నాగిరెడ్డి ములుగు చేరుకున్నారు. చత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని పోలీసులు బయటకు చెప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news