OTT ALERT: సరికొత్త జానర్ లో వచ్చి హిట్ కొట్టిన సూపర్ హిట్ మూవీ ..

-

తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు అయిన విశాల్ కొత్త కొత్త కథలను ట్రై చేస్తూ వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఉబలాటపడుతుంటాడు. అలా ట్రై చేసిన సినిమాలలో ఒకటి “మార్క్ ఆంథోనీ”. సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ కథగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ సినిమాలో విశాల్ తో పాటుగా ఎస్ జె సూర్య, రీతువర్మ, సునీల్, సెల్వ రాఘవన్, అభినయ లు నటించి సక్సెస్ లో భాగం అయ్యారు. సెప్టెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులు నెమ్మదిగా బ్రహ్మరధం పట్టారు. ఎంతలా అంటే విశాల్ కెరీర్ లోనే 100 కోట్లు అందుకున్న సినిమాగా మంచి పేరును తీసుకువచ్చింది.

ఇంతగా హిట్ అయిన ఈ సినిమాను నిర్మాతలు ఈ నెల 13వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరి ఓటిటి లోనూ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకు లాభాలను ఇస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news