రాజస్థాన్ లో అధికార పార్టీ కాంగ్రెస్ కు ఓటమి తప్పదా ?

-

ఈ రోజు మొత్తం అయిదు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మరియు మిగిలిన స్థానిక పార్టీలు అభ్యర్థుల ఎంపిక మరియు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం రాజస్థాన్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సర్వే సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ABP – C ఓటర్ సర్వే ప్రజల దగ్గరకు వెళ్లి అభిప్రాయాలను సేకరించి దాని ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ కు షాక్ తప్పదని తెలుస్తోంది. ఈ సర్వే లో చూస్తే… ఎక్కువ శాతం మంది ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సుముఖంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రాజస్థాన్ – 200 స్థానాలు

కాంగ్రెస్ – 59 నుండి 69 స్థానాలు

బీజేపీ – 127 నుండి 137 స్థానాలు

బీఎస్పీ – 2 సీట్లకే పరిమితం

పై విధంగా ఫలితాలు వచ్చినట్లు ఈ సర్వే తెలిపింది. మరి దీనిని బట్టి కాంగ్రెస్ హుషారు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. లేదంటే మరో రాష్ట్రము బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news