నార్సింగ్ లో మరో దారుణం.. వివాహిత ఆత్మహత్య !

-

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నిజానికి ప్రేమ పేరుతో ఒక ప్రేమోన్మాది మొన్న ఒక యువతి మీద కత్తితో దాడి చేసిన ఘటన మరువక ముందే ఆకతాయి వేధింపులు తాళలేక ఈశ్వరమ్మ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవ్వరూ లేని‌ సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఈశ్వరమ్మ ఆత్మహత్య చేసుకుంది.

suicide

తరచూ తనను పెండ్లి చేసుకోమంటూ గురి చేసిన ఉన్యా నాయక్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. చాలా కాలం పాటు భరిస్తూ వచ్చిన ఆమె ఈరోజు ఉరేసుకుంది. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక 2 సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మ పై భర్త రెడ్యానాయక్ కత్తితో దాడి చేశారు. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటున్న ఈశ్వరమ్మని పెళ్లి పేరుతో ఉన్యా నాయక్ వేధింపులకు గురి చేసి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version