పక్కా కమర్షియల్ అంటున్న డైరెక్టర్ మారుతి..

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మారుతి, తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నాడు. ప్రతీరోజూ పండగే సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా, తర్వాతి చిత్రం అనౌన్స్ మెంట్ రాకపోవడం కొంత ఆశ్చర్యమే. ఐతే ప్రస్తుతం మారుతి దర్శకుడిగా సినిమా ఓకే అయ్యింది. ఏ హీరోతో అన్నది ఇంకా తేలలేదు కానీ, సినిమా టైటిల్ మాత్రం అప్పుడే వచ్చేసింది. తన తర్వాతి సినిమాకి “పక్కా కమర్షియల్” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడట. ఈ మేరకు ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతుంది.

తన సినిమాలతో హీరోలకు కమర్షియల్ బ్లాక్ బస్టర్లు అందించిన మారుతి, ప్రస్తుతం సినిమా టైటిల్ నే పక్కా కమర్షియల్ గా మార్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తిగా వాణిజ్యమైన అంశాలతో నిండి ఉంటుందని అర్థం అవుతుంది. మరి పక్కా కమర్షియల్ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారనేది చూడాలి. ప్రస్తుతానికి రవితేజ లేదా నాని ని హీరోగా అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version