శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఈ-సిగరెట్ల పట్టివేత

-

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు , బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా భారీ స్థాయిలో ఈ-సిగరెట్లు, సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

రూ.1.15 కోట్ల విలువైన ఈ-సిగరెట్లు, సిగరెట్లు, ప్రొటీన్​ పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద 4,792 ఈ-సిగరెట్లు, 2.82 లక్షల సిగరెట్లు, 150 సీసాల ప్రొటీన్‌ పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన 14 మందిని అదుపులోకి తీసుకొని సామాగ్రి తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇటీవలే శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిపై పటిష్ఠ నిఘా ఉంచినట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version